Pawan kalyan : తిరుపతి లడ్డు వ్యవహారంపై పవన్ కు కార్తీ ట్వీట్ !

హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్ లో యాంకర్ లడ్డు కావాలా నాయనా అని యాంకర్ అడగగా..ఇప్పుడు లడ్డు టాపిక్ మాట్లాడకూడదు ..అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని అంటాడు కార్తీ. 


Published Sep 24, 2024 02:18:00 PM
postImages/2024-09-24/1727167896_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుపతి లడ్డు వ్యవహారంపై హీరో కార్తీ కైంటర్ పవన్ కళ్యాణ్ చాలా హర్టింగ్ గా అనిపించిందట. ఈ విషయాన్ని డైరక్ట్ గా పవన్ కళ్యాణే స్వయంగా తెలిపారు. అసలు ఏం జరిగిందంటే ..కార్తీ న‌టిస్తున్న  ‘స‌త్యం సుంద‌రం’.అనే సినిమా చేస్తున్నారు. అర‌వింద్ స్వామి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 28న తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీని కోసం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్ లో యాంకర్ లడ్డు కావాలా నాయనా అని యాంకర్ అడగగా..ఇప్పుడు లడ్డు టాపిక్ మాట్లాడకూడదు ..అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని అంటాడు కార్తీ. 


ఈ డైలాగ్ చాలా వైరల్ అవుతుంది.తిరుమల లడ్డు మ్యాటరే కార్తీ మాట్లాడుతున్నాడని అందరు అన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.కొంద‌రు ల‌డ్డూ మీద జోకులు వేస్తున్నార‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. నిన్న ఒక సినిమా ఫంక్ష‌న్ చూశాను. ల‌డ్డూ టాఫిక్‌ చాలా సెన్సిటివ్ అని అన్నారు. ఇది సెన్సిటివ్ కాదు...మనకి వద్దు అనుకోకండి..అని ప్రతి హిందువు మాట్లాడాలని కోరారు.


అయితే పవన్ వ్యాఖ్యలకు కార్తీ రియాక్ట్ అయ్యారు. దయచేసి క్షమించండి. నేను ఆ ఉద్దేశ్యంలో అనలేదు. తిరుమల లడ్డు ప్రతి హిందువుకు సంబంధించిన విషయమని ..నేను ఆ విషయాన్ని జోక్ గా తీసుకోలేదని ..నా ఉద్దేశ్యం అది కాదని అన్నారు. తను కూడా తిరుమల శ్రీవారి భక్తుడ్ని అని తెలిపారు . ను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు కార్తీ. ఇప్పుడు ఈ ట్వీట్ మరింత వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : pawankalyan viral-news hero-karthi tirumala-laddu

Related Articles