దేవర ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అయితే ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా బాలీవుడ్ మోస్ట్ పాపులర్ బ్యూటీ
న్యూస్ లైన్ డెస్క్: దేవర ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అయితే ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా బాలీవుడ్ మోస్ట్ పాపులర్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయకగా ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.
ఇదే తరుణంలో దేవర సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ అనుకోలేదట. ముందుగా మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేద్దామనుకున్నారట. కానీ అనూహ్య మార్పుల వల్ల జాన్వికి సినిమా సెట్ అయిపోయిందట. మరి ఈ మూవీ ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే రష్మిక మందన్నా. కొరటాల శివ ముందుగా రష్మిక మందాన్నా ని ఈ సినిమా కోసం సంప్రదించారట.
కానీ ఆమె ఇతర చిత్రాల్లో చాలా బిజీగా ఉన్నానని డేట్స్ దొరకవని చెప్పడంతో, జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేశారట. అలాంటి ఈ చిత్రం సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. మరి చూడాలి ఈ సినిమా హిట్ కొడుతుందా లేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతుందా అనేది ముందు ముందు తెలవబోతోంది.