manch lakshmi: ఆసుపత్రి పాలయిన మంచు లక్ష్మి...ఏమైంది?

ఆమె శరీరానికి పడక అలర్జీ స్టార్ట్ అయ్యిందట. అది మ్యాటర్.  దీనికి వివరణ ఇస్తూ ఈ రోజు మరో వీడియో పోస్ట్ చేసింది లక్ష్మక్క.


Published Aug 26, 2024 03:44:00 PM
postImages/2024-08-26/1724667624_manchulakshmi1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లక్ష్మి అక్క ఇప్పుడు అమెరికాలో ఉంది. అవును అక్కడే ఆసుపత్రిలో చేరింది.ఎవరో చెప్పలేదు ...మంచు లక్ష్మే తన సోషల్ మీడియా అకౌంట్ లో తన మూతంతా ప్లాస్టర్స్ వేసి ఉన్న పిక్ ను పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ , ఫ్రెండ్స్ అంతా భయపడి చచ్చారు కూడా. ఇప్పుడు అంతా నార్మల్ అంట ..ఇది కూడా తనే వీడియో పోస్ట్ చేసింది అసలు ఏమైందంటే తన  ఫ్యామిలీతో అమెరికాకు వెకేషన్ కు వెళ్లిందట అమ్మడు. అక్కడ అక్క ఏవో టాబ్లెట్స్ వేసుకుందట. అవి ఆమె శరీరానికి పడక అలర్జీ స్టార్ట్ అయ్యిందట. అది మ్యాటర్.  దీనికి వివరణ ఇస్తూ ఈ రోజు మరో వీడియో పోస్ట్ చేసింది లక్ష్మక్క.


"నేను పెట్టిన ఫొటో చూశారు కదా.. ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాను. అసలు ఏమైందంటే ముందు అందరూ మన శరీరం ఏది తీసుకోగలదో.. ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి.నాకు ఆ టాబ్లెట్ పడలేదని నాకు ఇప్పుడే తెలిసింది. ఆ రోజు నా లక్ బాగుండి నాతో ఫ్రెండ్స్ ఉన్నారు.వారిలో డాక్టర్స్ ఉన్నారు. వెంటనే అలర్జీ మెడిసిన్ తీసుకున్నాను. ఇఫ్పుడు తగ్గింది. ఇన్ని రోజులకు మూతి నార్మల్ అయ్యి లిప్ స్టిక్స్ వేసుకుంటున్నానని  తెలిపింది. 


ఆ అలర్జీ వల్ల తన మూతి అంతా పగలిపోయిందని...తన చేతిమీద కూడా ఎర్రగా బంప్స్ వచ్చాయని తెలిపింది.ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది. కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ రెండు వారాలు మాత్రం సినిమా చూసేశా.." అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. చుట్టాలు, ఫ్యాన్స్ చాలా మెసేజెస్ , ఫోన్స్ చేశారని వారందరికి థాంక్యూ అంటూ చెప్పుకొచ్చింది.
 

newsline-whatsapp-channel
Tags : viral-news hospital social-media manchu-laxmi

Related Articles