తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది సాయిపల్లవి మాత్రమే. అలాంటి ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంతో నేచురల్ గా నటిస్తూ ఎంతో గుర్తింపు పొందింది. అలాంటి ఈ
న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది సాయిపల్లవి మాత్రమే. అలాంటి ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంతో నేచురల్ గా నటిస్తూ ఎంతో గుర్తింపు పొందింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో ఫిదా, లవ్ స్టోరీ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పరిచయమైంది. ఈయన డైరెక్షన్ లో ఫిదా మరియు నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ చిత్రంలో నటించింది.
ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీలో అద్భుతమైన హిట్లు సాధించాయి. అలాంటి సాయిపల్లవి తాజాగా అదే దర్శకుడి డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. సినిమాలో కథానాయికగా సాయిపల్లవి అనే ఎంపిక చేస్తారట. అంతేకాకుండా హీరోగా నేచురల్ స్టార్ నానిని అనుకున్నట్టు తెలుస్తోంది. నానితో సాయిపల్లవి శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ వంటి చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు అద్భుతమైన హిట్ సాధించాయి. ఈ విధంగా ముచ్చటగా మూడోసారి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాని హీరోగా సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరికి కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.