VENU SWAMI: వేణుస్వామి జాతకం తిరగబడింది ..అరెస్ట్ కు రంగం సిధ్ధం !

మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. జూబ్లిహిల్స్ పోలీసులు వేణుస్వామి పై చర్యలు చేపట్టాల్సిందేనని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది.


Published Sep 13, 2024 05:17:00 PM
postImages/2024-09-13/1726228120_251897venuswami.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వేణుస్వామికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. సెలబ్రెటీస్ గురించి నచ్చింది మాట్లాడుతూ ...నాగచైతన్య, సమంత, ప్రభాస్ అందరిని ట్రోల్ చేశాడు మహానుభావుడు.అతడిపై కేసు నమోదు చెయ్యాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. జూబ్లిహిల్స్ పోలీసులు వేణుస్వామి పై చర్యలు చేపట్టాల్సిందేనని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది.


వేణు స్వామి జాతకాల పేరిట ప్రజలను మభ్య పెడుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను మార్పింగ్ చేసి తప్పుదోవ పట్టించాడు. ఇటీవల వేణు స్వామి దంపతులు ఒక వీడియో విడుదల చేశారు. సదరు వీడియోలో టీవీ 5 మూర్తి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. టీవీ 5 మూర్తి వలన మాకు ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం.. అని వీడియోలో ఆవేదన చెందారు. దీని పై మూర్తి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తను అలాంటి ఏ ఆరోపణలు చేయలేదని ..డబ్బు డిమాండ్ చెయ్యలేదని అన్నారు. 


అలాగే వేణు స్వామి దంపతులు ఒక ఆడియో కాల్ రికార్డు ఆ వీడియోలో వినిపించారు. అయితే వేణుస్వామి మోసాలు బయటపడకుండా ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నాడని ఇక ఇంతటితో వేణుస్వామి ఆట కట్ అని అన్నారు మూర్తి. నచ్చినట్లు మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడాలని ఎవరి కష్టపెట్టకుండా ఉండాలని అన్నారు. ఇఫ్పుడు వేణుస్వామి ఏం చేస్తారో చూడాలి. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu arrest venuswamy court hyderabad-police

Related Articles