దగ్గుబాటి రామానాయుడు కొడుకులైన వెంకటేష్, సురేష్ బాబు నిజంగానే ఆస్తికోసం తన్నుకున్నారా.. ఇప్పటివరకు ఈ విషయం ఎక్కడ బయటపడలేదే అనుకుంటారు చాలామంది ఈ విషయం తెలిసి. మరి ఇంతకీ దగ్గుబాటి బ్రదర్స్
న్యూస్ లైన్ డెస్క్: దగ్గుబాటి రామానాయుడు కొడుకులైన వెంకటేష్, సురేష్ బాబు నిజంగానే ఆస్తికోసం తన్నుకున్నారా.. ఇప్పటివరకు ఈ విషయం ఎక్కడ బయటపడలేదే అనుకుంటారు చాలామంది ఈ విషయం తెలిసి. మరి ఇంతకీ దగ్గుబాటి బ్రదర్స్ మధ్య గొడవ ఎక్కడ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..
వెంకటేష్ కి, సురేష్ బాబుకి మధ్య గొడవ వచ్చింది ఆస్తి విషయంలోనూ అంతస్తు విషయంలోనూ కాదు.ఒక చిన్న చికెన్ ముక్క విషయంలో.. అవును మీరు వినేది నిజమే. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. వెంకటేష్ ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరికి కోడి కూర అంటే చాలా ఇష్టమట..
ఇంట్లో కోడి కూర వండితే ఇద్దరు అన్నదమ్ముల మధ్య డైనింగ్ టేబుల్ కింద కొట్లాట జరిగేదట.. ఇక రామానాయుడు బతికున్నప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ మొత్తం కలిసే ఉండేది.ఆ టైంలో వాళ్ల ఇంట్లో కోడికూర వండితే అందరూ చాలా ఇష్టంగా తినేవారట. అయితే కుటుంబం పెద్దది కాబట్టి ఒకటి కోస్తే సరిపోదని రెండు కోళ్లు కోసేవారట. కానీ రెండు కోళ్లు కోసినా కూడా వారికి సరిపోయేది కాదట.
అలా ఒకరు ముక్కలు వేసుకుంటే మరొకరు అది నా ముక్క అంటూ వెంకటేష్, సురేష్ బాబు ఇద్దరూ డైనింగ్ టేబుల్ కింద కాళ్లతో తన్నుకునే వారట.అలా ఫుడ్ విషయంలో ఇద్దరికీ గొడవ ఉండేదని, ఇక చివరికి రానా కూడా చేరడంతో ముగ్గురు మధ్య కోడి కూర వండిన రోజు డైనింగ్ టేబుల్ కింద పెద్దవార్ జరిగేది అంటూ ఒక ఫన్నీ విషయాన్నీ వెంకటేష్ చిరంజీవి హోస్టుగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో బయట పెట్టారు