KTR : కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ మాస్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.


Published Jul 26, 2024 01:21:19 PM
postImages/2024-07-26/1721980279_KTRWarning.jpg

న్యూస్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు రైతులకు నీళ్లివ్వాలని డెడ్ లైన్ విధించారు. రైతులకు నీళ్లివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత గాకపోతే 50వేల మందితో మేమే వచ్చి కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా ధ్వంసమైందని.. వరద ప్రవాహాన్ని తట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి బీఆర్ఎస్ మేడిగడ్డను సందర్శించింది. తాజాగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ క్రమంలో మేడిగడ్డకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. అయినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ తట్టుకొని నిలబడింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యం కోల్పోలేదని.. నిరూపించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్లతో పాటు పలు బ్యారేజీల సందర్శనకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డను సందర్శించిన అనంతరం కేటీఆర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news revanth-reddy ktr telanganam cm-revanth-reddy telangana-government latest-news kaleshwaram-projcet

Related Articles