అయితే అమెరికాలో యూఎస్ మార్షల్స్ రాణాను భారత్ కు అప్పగిస్తున్నట్లు తీసిన ఫొటోను బయటకు రిలీజ్ చేశారు,. అయితే ఈ పిక్ ను అమెరికా న్యాయ శాఖ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ముంబాయి ఉగ్రవాది 26/11 కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్ కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే . అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వెంటనే రాణాను నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది.
అయితే అమెరికాలో యూఎస్ మార్షల్స్ రాణాను భారత్ కు అప్పగిస్తున్నట్లు తీసిన ఫొటోను బయటకు రిలీజ్ చేశారు,. అయితే ఈ పిక్ ను అమెరికా న్యాయ శాఖ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది, కాగా 2009 నుంచి యూఎస్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను ఆ దేశం బుధవారం అధికారికంగా భారత్ కు అప్పజెప్పింది. అయితే భారత్ ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చెయ్యాల్సి ఉంది.