Nithyananda: నిత్యానంద చనిపోయారా ..ఇందులో నిజం ఎంత !

2023 లో నిత్యానంద స్వామి ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి  హాజరై ప్రసంగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.


Published Apr 01, 2025 06:56:00 PM
postImages/2025-04-01/1743514085_sddefault.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆధ్యాత్మిక వేత్త స్వామి నిత్యానంద స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో కొత్తదేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశం ఎక్కడ ఉండనేది మాత్రం ఎవరికీ తెలియదు. 2023 లో నిత్యానంద స్వామి ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి  హాజరై ప్రసంగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.


తాజాగా నిత్యానందకు సంబంధించిన ఓ వార్త సంచలనం రేకెత్తిస్తుంది.నిత్యానంద చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఈ సందేశాన్ని మీడియాకు పంపినట్లు సమాచారం . హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారని సుందరేశ్వరన్ చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను చాలా మంది కొట్టి పారేస్తున్నారు. ఏప్రిల్ పూల్ చేయడానికి ఈ వార్తను ప్రచారం చేస్తున్నారు. అయితే నిత్యానంద చనిపోయినట్లు అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు ప్రకటన చేయలేదు. 


ఈ వార్తలను పలువురు కొట్టిపారేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఈ వార్తను ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే నిత్యానంద చనిపోయినట్లు అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు ప్రకటన చేయలేదు. దీంతో మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu national death

Related Articles