dog : కుక్కకు బంగారు గొలుసు కొన్న ఓనర్...ఫుల్ ఖుష్ లో డాగ్

Published 2024-07-05 17:21:49

postImages/2024-07-05/1720180309_819b1be0e7a24919ab13a90863ca967c.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలే బంగారం వేలల్లో పెరుగుతుంది. మనుషులే కొనుక్కొని వేసుకోలేకపోతున్నారు. అలాంటి కుక్కకు మూడు తులాల బంగారు గొలుసు వేసింది ఓ పెట్ లవర్. మరి ఆ కుక్క ..ఈ మేడం కి ఏం అంత నచ్చిందో ...ఎంత విశ్వాసం చూపించిందో తెలీదు కాని బంగారం మాత్రం కొని వేసింది. ఆ గొలుసు చూసి ...ఆ కుక్క ఎంత హ్యాపీ ఫీలయ్యిందో తెలుసా ..ఏకంగా... డించక ..డించక డ్యాన్స్  కూడా వేసింది.


ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన సల్దాన్హా అనే మహిళ ఇటీవల తన పెంపుడు శునకం ‘టైగర్’ను తీసుకుని అక్కడి ఫేమస్ జ్యువెలరీ షాప్ అనిల్ జ్యువెలర్స్ కు వెళ్లింది. అక్కడ జ్యూయలరీ చూసి పెట్ డాగ్ తెగ సంబరపడిపోతుందట. అయితే తనకు తన పెట్ కు గోల్డ్ ఛైన్ తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. బంగారు చైన్ రెండు లక్షలు పెట్టి కొనింది. శునకం ఆనందంగా అటూ ఇటూ గంతులు వేయడం గమనార్హం. అనిల్ జ్యువెలర్స్ యజమాని పీయూష్ జైన్ దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు.


సల్దాన్హా తన శునకం కోసం 35 గ్రాముల బంగారు గొలుసు కొన్నదని, దాని విలువ రూ.2.5 లక్షలు అని పీయూష్ జైన్ తెలిపారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. వేలకొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి. పెట్ లవర్స్ అంతా ...ఆమెను పొగుడుతుంటే....మరింత కొంతమంది మాత్రం ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. పేదవాళ్లకి ఓ పూట పెట్టరు కాని ఇలా జంతువులకు చేస్తారంటు విమర్శలు గుప్పిస్తున్నారు.