ఈ న్యూ ఛాయ్వాలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక విచిత్రమైన నిరసన చేపట్టాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రాజస్థాన్ కు చెందిన కృష్ణ కుమార్ థకాడ్ భార్య పై వినూత్నమైన నిరసన చేస్తున్నాడు. చేతికి బేడీలు వేసుకొని ఛాయ్ అమ్ముతుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఆ టీ స్టాల్ పేరు కూడా వెరైటీగా పెట్టాడు. దీంతో ఈ న్యూ ఛాయ్వాలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక విచిత్రమైన నిరసన చేపట్టాడు.
కృష్ణకుమార్ కు 2018 సంవత్సరంలో మీనాక్షి మాళవ్ తో వివాహం జరిగింది. వారిద్దరు తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. వారు పెట్టిన వ్యాపారం స్థానిక మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు వారి గుర్తింపును కూడా తెచ్చింది. అయితే 2022 లో ఎందుకో సడన్ గా వైఫ్ పుట్టింకి వెళ్లిపోయింది. కాని వెళ్లిపోయింది వెళ్లిపోక కృష్ణపై ఐపీసీ సెక్షన్ 498A (కట్నం వేధింపులు), సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసింది.
తన భార్య తప్పుడు కేసు పెట్టి నన్ను వేధింపులకు గురిచేస్తుందని కృష్ణ కుమార్ ఆరోపిస్తున్నాడు. తప్పుడు కేసు కారణంగా తన జీవితం నాశనం అయిందని, గత మూడేళ్లుగా నేను న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు ముసలి తల్లి ఉంది. నాపై ఆధారపడి ఉంది. నేను షెడ్ ఇంట్లో ఉంటున్నాను. ఇక నాపై కేసులు వేస్తూ కోర్టులు తిప్పినా నేను ఏం ఇవ్వలేను. దీంతో చేసేది లేక కోర్టులు చుట్టూ తిరిగే బదులు ..ఇలా రివైంజ్ తీర్చుకున్నాడు.
తన భార్య పెట్టిన వరకట్నం వేధింపుల సెక్షన్ 498A పేరుతో.. 498A కేఫ్ అని పెట్టాడు. అంతేకాదు.. భార్య పెట్టిన కేసులో మూడేళ్ల పాటు తాను అనుభవించిన బాధను తెలియజేసేలా చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్మడం మొదలు పెట్టాడు. దీంతో కృష్ణ కుమార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. భార్య పెట్టిన సెక్షన్ల పేరుతో కృష్ణ పెట్టిన ‘498A టీ కేఫ్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణకుమార్ భార్య మీనాక్షి మాళవ్ మాత్రం తన భర్త పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.