Yash Yadav: ఇంట్లో మంటలు ..8 వఅంతస్థు నుంచి దూకేసిన కుటుంబం !

ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి ఓ తండ్రి తన పిల్లలతో దూకేశాడు. ఈ ప్రమాదం లో వారు ముగ్గురు చనిపోయారు. 


Published Jun 10, 2025 06:46:00 PM
postImages/2025-06-10/1749561412_cats4.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భయం ఏ పనైనా చేయిస్తుంది. మనం ఏం చేస్తున్నామో తెలీకుండా మన మనసుకు మెదడుకు ఓ పొర కప్పేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఓ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ద్వారక ప్రాంతంలోని ఓ నివాస భవనంలో చెలరేగిన మంటలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి ఓ తండ్రి తన పిల్లలతో దూకేశాడు. ఈ ప్రమాదం లో వారు ముగ్గురు చనిపోయారు. 


ద్వారక సెక్టర్-13లోని షాపత్ సొసైటీ అనే రెసిడెన్షియల్ భవనంలోని 8, 9 అంతస్తుల్లో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో కిటికీల నుంచి దట్టమైన పొగలు అన్ని వైపుల వ్యాపించాయి. దీంతో ఎనిమిదవ అంతస్తులో ఉంటున్న యశ్ యాదవ్ ఆయన పదేళ్ల పిల్లలు ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. తీవ్రగాయాలతో వారు చనిపోయారు. 


ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన యశ్ యాదవ్ భార్య, పెద్ద కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది స్కైలిఫ్ట్ సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. భవనానికి విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fire-accident delhi

Related Articles