Revanth reddy: మళ్లీ ఢిల్లీకి సీఎం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలను ఆకర్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 10 రోజుల పాటు విదేశాల్లోనే ఉన్నారు. పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. 
 


Published Aug 14, 2024 01:09:51 AM
postImages/2024-08-14/1723614667_revanthreddy.jpeg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన టీంతో కలిసి హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీంతో ఆయనను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా,  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలను ఆకర్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 10 రోజుల పాటు విదేశాల్లోనే ఉన్నారు. పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. 


అయితే, ఇప్పటికే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపే సీఎం.. తాజగా, మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై పార్టీ అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇటీవల పార్టీలో జరుగుతున్న చేరికలపై కూడా ఆయన చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీని వర్గాలు చెబుతున్నాయి. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu congress telanganam politics cm-revanth-reddy delhi

Related Articles