సునీతా తోపాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. వారిద్దరు ఈ నెల 19న భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునితా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం అందరికి తెలిసిందే. దాదాపు 9 నెలలు గా అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. సునీతా తోపాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. వారిద్దరు ఈ నెల 19న భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది.
ఇందుకుగానూ నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ను ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. దీని ద్వారానే సునితా విలియమ్స్ , బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం ఈ నెల 12న జరగనుంది. మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా ఉంటుండడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ లో సునితా విలియమ్స్ ..తీవ్రమైన ఎముకల సాంద్రత తగ్గింది. అలాగే కంటిసమస్యలు , శారీరంలో బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది.
చాలా కాలం మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు. దీంతో కండరాల బలహీనతకు ఇది దారితీస్తుంది. కాళ్లు, తొడల వెనుక భాగం వంటి భాగాల్లో ఈ సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఎముకలు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.న్యూరోవెస్టిబ్యులర్ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సునీతా విలియమ్స్ కంటి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.