Street dogs: గర్భిణీ సహా 12 మందిపై వీధి కుక్కల దాడి

బోధన్ పట్టణంలోని తట్టికోట, కుమార్గల్లి తదితర ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన వారు తీవ్ర ఆందోలన వ్యక్తం చేశారు.


Published Aug 21, 2024 11:25:42 AM
postImages/2024-08-21/1724219742_bodhan.jpg

న్యూస్ లైన్ డెస్క్: బోధన్ పట్టణంలో వీధి కుక్కలు స్పైర విహారం చేస్తున్నాయి. ఒకేరోజు ఏకంగా 12 మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయని గ్రామస్థులు వాపోతున్నారు. పిచ్చి కుక్కల దాడిలో గాయపడిన వారిలో నాలుగేళ్ల చిన్నారితో పాటు గర్భిణీ కూడా ఉండడం గమనార్హం. బోధన్ పట్టణంలోని తట్టికోట, కుమార్గల్లి తదితర ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన వారు తీవ్ర ఆందోలన వ్యక్తం చేశారు.


చికిత్స అనంతరం గాయపడిన వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి పిచ్చి కుక్కల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తూ బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. కుక్కల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని అన్నారు. ఇప్పటికే పలు మార్లు అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.  కాగా, అక్కిడి చేరుకున్న పోలీసులు ఆందోలనకారులకు నచ్చజెప్పి పంపించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam street-dogs

Related Articles