Medicover hospital: హనుమకొండ మెడికవర్ హాస్పిటల్‌లో ఠాగూర్ సీన్ రిపీట్

 

డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేశారంటూ ఆరోపణలు 


Published Sep 18, 2024 05:24:23 AM
postImages/2024-09-18/1726653871_newslinetelugu27.jpg

న్యూస్ లైన్ డెస్క్: హనుమకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల(72) బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో మెడికవర్‌లో చేరగా.. ఆపరేషన్‌కు ముందే రూ. 2 లక్షల 10వేలు వసూలు చేసి ఒకేసారి రెండు సర్జరీలు చేశారని ఆమె బంధువులు తెలిపారు. 

వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి, డయాలసిస్ చేసి.. ఈసీజీ అంటూ హడావుడి చేసి.. చివరికి చనిపోయిందని చెబుతున్నారని వెల్లడించారు. 

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సుశీల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన మనిషికే ట్రీట్ మెంట్ చేశారని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది రాలేదని ఆందోళనకు దిగారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news newslinetelugu telanganam districts strike hospital deadbody

Related Articles