Assembly: సీఎం ఛాంబర్ ముందు బైఠాయించిన BRS ఎమ్మెల్యేలు

చివరికి గెలిచేది పాండవులు.. నిలిచేది పాండవులే అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పక్షం అహంకారంతో చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 


Published Aug 01, 2024 02:44:18 AM
postImages/2024-08-01/1722498249_newslinetelugu5.jpg

న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు BRS ఎమ్మెల్యేలు బైఠాయించారు. అసెంబ్లీ సభను ఏక పక్షంగా జరుపుతున్నారని నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాన్ని కౌరవులసభలాగా నిర్వహిస్తున్నారని సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చివరికి గెలిచేది పాండవులు.. నిలిచేది పాండవులే అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పక్షం అహంకారంతో చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 

కాగా, బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి అసెంబ్లీ సభపైఅసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులే సమయం ఉందని.. మాట్లాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ఇష్టం లేని వారు సభ నుండి వాక్ ఔట్ చేయాలని అన్నారు. దీంతో BRS ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ బయట బైఠాయించి నిరసన తెలిపారు. సభను ఏకపక్షంగా జరుపుతున్న తీరుపై ఆందోలన చేపట్టారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news newslinetelugu brs ktr harish-rao harishrao jagadish-reddy sabithaindrareddy telanganaassembly swamivivekananda

Related Articles