సల్మాన్ ఈ సారి మాత్రం బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసుల్లోంచి తన అభివాదం తెలిపారు.గతంలో సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో, ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతి యేడాది రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు. తనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు ముంబయిలోని తన నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
ప్రతి యేడాది ...ఈద్ వేడుకల్లో కొన్ని వేల మంది సల్మాన్ ఖాన్ ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు. ప్రతి యేడాది బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేసే సల్మాన్ ఈ సారి మాత్రం బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసుల్లోంచి తన అభివాదం తెలిపారు.గతంలో సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో, ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులోను ..బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేశారు. ఈ ద్ రోజున అభిమానులకు నిరాశపరచకూడదనే ఇలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల్లోంచి శుభాకాంక్షలు తెలిపారు. తెల్లని పఠానీ సూట్లో మెరిసిన సల్మాన్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక నుంచే అభిమానులకు ఈద్ ముబారక్ తెలిపారు. "షుక్రియా, థాంక్యూ, సబ్ కో ఈద్ ముబారక్" అంటూ తన ప్రేమను చాటుకున్నారు.
లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ కు వార్నింగ్స్ ఇస్తున్నారు.సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.