KTR: కవితకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ రాఖీ పౌర్ణమి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.


Published Aug 19, 2024 03:42:49 PM
postImages/2024-08-19/1724062369_ktrrakhi.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ రాఖీ పౌర్ణమి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమా సోదరీమణి కవిత ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు మాతో లేకపోవడం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కట్ర చేసి కవితను జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ ని వాడుకోని కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అయినా ఆమెకి న్యాయం లభిస్తుందని సుప్రీంకోర్టుపైన నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana mla brs ktr mlc-kavitha rakhifestival

Related Articles