KTR: విదేశాంగ మంత్రికి కేటీఆర్ లేఖ

పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి నర్సయ్య కోసం విదేశాంగ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.


Published Aug 11, 2024 08:08:04 AM
postImages/2024-08-11/1723380696_external.PNG

న్యూస్ లైన్ డెస్క్: పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి నర్సయ్య కోసం విదేశాంగ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. నర్సయ్యను భారతదేశానికి రప్పించేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారు. విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా ఈ మేరకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్‌లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని కేటీఆర్ సూచించారు. బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మానువాడ నర్సయ్యకు అండగా ఉంటానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నర్సయ్యను వేంటనే దేశానికి రప్పించేలా చూడాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ కు కేటీఆర్ ఈ మేరకు ఒక లేఖ రాశారు. అనేక సంవత్సరాలుగా ఆచూకీ లేకుండా పోయిన నర్సయ్య బహ్రెయిన్ లోని జైల్లో పాస్‌పోర్ట్ సమస్యలతో చిక్కుకున్నారు.

బతుకు దెరువు కోసం 28 ఏళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య బహ్రెయిన్ లో చిక్కుకు పోయారు. గత జనవరి నుంచి అక్కడి జైల్లో ఉన్నాడు. 1996 లో బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య అక్కడి ‘ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ’ లో మూడేళ్ళ పాటు తాపీ మేస్త్రీ గా పనిచేశాడు. 1999 ఆగస్ట్ లో ఆయన వర్క్ పర్మిట్ ముగిసినా ఆయన అక్కడే పనిచేస్తూ ఉన్నాడు నర్సయ్య. ఆయన పాస్‌పోర్ట్ గడువు 2001 లో ముగియటంతో  బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ఇప్పుడు ఆ పాస్‌పోర్ట్ గడువు కూడా ముగిసింది. నర్సయ్య పాస్ పోర్ట్ పొగొట్టుకున్నాడు. వర్క్ పర్మిట్, పాస్ పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. దీంతో నర్సయ్య జైల్లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. నర్సయ్యను భారత్ కు రప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి రావటంతో ఆయన స్పందించారు. నర్సయ్య ను భారత్ కు రప్పించేందుకు అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని చెప్పారు. నర్సయ్యకు తాత్కాలిక పాస్‌పోర్ట్ ను ఇచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను కేటీఆర్ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో పూర్తి సహకారం అందించి నర్సయ్య పాస్ పోర్ట్ జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా ఈ మేరకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను విడుదల చేసి భారత్ కు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను బహ్రెయిన్ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని, నర్సయ్య గుర్తింపును ధృవీకరించాలని బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థ 'లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ' 2024 జనవరి 8న బహ్రయిన్ లోని భారత రాయబారికి లేఖ రాసిందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నర్సయ్యను వెంటనే స్వదేశానికి పంపించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నర్సయ్య కు భారత ప్రభుత్వం తాత్కాలిక పాస్ పోర్ట్ ను జారీ చేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేసి తిరిగి భారత్ కు పంపించే అవకాశం ఉందన్నారు.  

అదే విధంగా బహ్రెయిన్ లోని పార్టీ ఎన్ఆర్ఐ  విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి నర్సయ్య చిరునామా కనుక్కొని సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ద్వారా నివేదిక నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వీలైనంత నివేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను మరింత వేగంగా తీసుకెళ్లాలని తన కార్యాలయ సిబ్బందికి కేటీఆర్ ఆదేశించారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr india jaishankar

Related Articles