Congress Mla: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి రియాక్షన్

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.


Published Sep 09, 2024 04:59:16 AM
postImages/2024-09-09/1725875704_kadiyam.PNG

న్యూస్ లైన్ డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌కి వెళ్తామని, వివిధ కోర్టులు వివిధ రూపాల్లో తీర్పులు ఇచ్చాయి అన్నారు. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై కామెంట్ చేసే నైతిక అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని కడియం అన్నారు. సింగిల్ బెంచ్ తీర్పుపై డబుల్ బెంచ్‌కు వెళ్ళొచ్చు అని, అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు అని ఆయన అన్నారు. ఈ తీర్పుపై తమ న్యాయవాదులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla congress cm-revanth-reddy congress-government telanganahighcourt

Related Articles