తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో లేదంటే ఏదైనా వ్యాపార రంగంలో రాణిస్తూ అందరికీ పరిచయం అవుతూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ భార్య మాత్రం
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో లేదంటే ఏదైనా వ్యాపార రంగంలో రాణిస్తూ అందరికీ పరిచయం అవుతూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ భార్య మాత్రం ఇంతవరకు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడా కూడా తన నోటిలో మాట బయట పెట్టలేదు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ నిండు తెలుగు గృహిణిలా తన పని ఏంటో తాను, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అలాంటి లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ప్రేమ. కానీ వీరిద్దరి మొదటి సంతానం సమయంలో మాత్రం లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తో చాలా పెద్ద అబద్ధం చెప్పింది. మరి ఆమె చెప్పిన అబద్ధం ఏంటి ఆ వివరాలు చూద్దాం..
ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి 2011లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికి అభయ్ రామ్, భార్గవ్ రాం అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే 2014లో మొదటి సంతానమైనటువంటి అభయ్ రామ్ జన్మించాడు. మొదటి డెలివరీ సమయంలో ఎన్టీఆర్ కు లక్ష్మీ ప్రణతి ఒక విషయంలో అబద్ధం చెప్పిందట. అయితే ఆమె నిండు గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ రభస షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారట. ఆ షూటింగ్ సమయంలో ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి వీడియో కాల్ చేసి మాట్లాడే వారట. ఆరోగ్యం గురించి ఆరా తీసేవారట. అంతే కాదు నేను మళ్ళీ ఇండియాకు వచ్చేవరకు నువ్వు బిడ్డను కనొద్దు అని చెప్పారట.
అలా ఎన్టీఆర్ చెప్పిన మరుసటి రోజు లక్ష్మీ ప్రణతి హాస్పిటల్ కి వెళ్ళింది. ఈ టైంలో ఎన్టీఆర్ ఫోన్ చేస్తే కామన్ చెకప్ కు వెళ్తున్నానని చెప్పిందట. దీంతో ఎన్టీఆర్ కి ఏదో డౌట్ కొట్టి చాలా భయపడిపోయారట. వెంటనే స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్ కు టికెట్ బుక్ చేసుకుని అప్పటికప్పుడే ఇక్కడ దిగిపోయారట.. అయితే చెకప్ కోసం తన అమ్మ కూడా హాస్పిటల్ కి వెళ్ళింది. ఇదే సమయంలో హైదరాబాదులో దిగి ఎన్టీఆర్ నేరుగా తన ఇంటికి వెళ్లారట వెళ్లి ఫ్రెష్ అప్ అయి కాఫీ తాగుతున్న సమయంలో తన అమ్మ ఫోన్ నుంచి కాల్ వచ్చిందట. దీంతో ఎన్టీఆర్ భయంతో చల్లని చెమటలు వచ్చాయట. ఏంటమ్మా ఏం జరిగింది అని అడిగితే నిన్ను డాక్టర్ గారు వెంటనే రమ్మంటున్నారు అని చెప్పిందట. దీంతో ఎన్టీఆర్ ఆగమేగాల మీద హాస్పిటల్ చేరుకున్నారు.
అప్పటికే లక్ష్మీ ప్రణతిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. ఎన్టీఆర్ అక్కడికి చేరుకోగానే తన పెద్దబ్బాయి అభయ్ జన్మించాడు. అలా చివరి క్షణంలో ఎన్టీఆర్ కళ్ళముందే తన పెద్దబ్బాయి అభయ్ రామ్ పుట్టారు.. అయితే లక్ష్మీ ప్రణతికి అప్పటికే నొప్పులు వచ్చినా కానీ ఎన్టీఆర్ గాబరా పడతారని, ఏం లేదని అబద్ధం చెప్పి ఆమె హాస్పిటల్ కి వెళ్ళింది. ఎన్టీఆర్ అదంతా గ్రహించి ముందుగానే హైదరాబాద్ చేరుకుని తన కొడుకు పుట్టే సమయంలో అక్కడ ఉండగలిగానని చెప్పుకొచ్చాడు.