Savitri: సావిత్రి మెడలోని పూలదండకు అన్ని లక్షలా..?

దివంగత నటి సావిత్రి గురించి చెబితేనే ఆమె అభిమానుల కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతాయి.. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికినా ఈ మహానటి చివరి రోజుల్లో ఎంతో దుర్భర పరిస్థితుల్లో మరణించింది. ఇక ఈమె  పరిస్థితిని చూసి 


Published Sep 27, 2024 04:40:00 PM
postImages/2024-09-27/1727427935_savitri.jpg

న్యూస్ లైన్ డెస్క్: దివంగత నటి సావిత్రి గురించి చెబితేనే ఆమె అభిమానుల కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతాయి.. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికినా ఈ మహానటి చివరి రోజుల్లో ఎంతో దుర్భర పరిస్థితుల్లో మరణించింది. ఇక ఈమె పరిస్థితిని చూసి ఎవరు కూడా జాలి పడలేదు. అయితే ఇలాంటి దుర్భర పరిస్థితి రావడానికి కూడా సావిత్రి నే కారణం అంటారు కొంతమంది.

ఎందుకంటే ఆమె ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోయింది. అలాగే అంతా నా వాళ్లే అని ఆస్తిపాస్తులు ఇవ్వడం. లెక్కకు మించి దానధర్మాలు చేయడం వంటివి చేసింది.ఇక మరీ ముఖ్యంగా ఆమె చివరి రోజుల్లో మద్యానికి బానిసవ్వడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించింది. అయితే అలాంటి మహానటి సావిత్రి గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుసుకుందాం.. అదేంటంటే..

అప్పట్లో పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ విపత్తు నిధికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి దగ్గర విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఎవరు కూడా ముందుకు రాలేదట. కానీ ఆ సమయంలో సావిత్రి విరాళం ఇచ్చిందట. దాంతో పివి నరసింహారావు సావిత్రి మెడలో ఒక పూలమాల వేసి సత్కరించారట.

అయితే ఆరోజు సావిత్రి మెడలో వేసిన ఆ పూలమాలను వేలంలో పెట్టగా దాన్ని 30 వేలకి పైగా వేలం పాట పాడి దక్కించుకున్నారట. ఇక అప్పట్లో 30000 అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానం. ఈ విషయం వింటేనే చాలామందికి షాక్ అనిపిస్తుంది. మరి అప్పట్లో సావిత్రి క్రేజ్ అలా ఉండేది.అయితే ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ నటి జమున ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది

newsline-whatsapp-channel
Tags : news-line ap mahanati p.v.narasimha-rao savitri jamuna

Related Articles