Janhvi Kapoor: హాస్పిటల్లో జాన్వీ కపూర్.. కారణమిదే..? 

బాలీవుడ్ అందాల బ్యూటీ జాన్వీ కపూర్ అంటే తెలియని వారు ఉండరు.. ఈమె బాలీవుడ్లోకి ధడక్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో  పాన్ ఇండియా  మూవీ దేవరలో హీరోయిన్ గా షూటింగ్లో కూడా పాల్గొంది.అయితే వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న జాన్వీ కపూర్ తాజాగా హాస్పిటల్ పాలైనట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని బోనీ కపూర్ బయటపెట్టారు.  జాన్వీ కపూర్ ఎందుకు హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. జాన్వీ కపూర్ తిన్న ఆహారం కల్తీ అవ్వడంతో ఫుడ్ పాయిజన్ అయింది.దీంతో అస్వస్థతో జాన్వీ కపూర్ కి అస్వస్థత ఎక్కువవ్వడంతో వెంటనే బోనీ కపూర్ ముంబైలోని హాస్పిటల్ లో తీసుకువెళ్లి చికిత్స అందించారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ చెప్పారు. అంతేకాకుండా జాన్వీ కపూర్ ని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు కావచ్చు అని కూడా చెప్పారు.


Published Jul 18, 2024 09:20:00 PM
postImages/2024-07-18/1721316519_bollywood.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ అందాల బ్యూటీ జాన్వీ కపూర్ అంటే తెలియని వారు ఉండరు.. ఈమె బాలీవుడ్లోకి ధడక్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ జాన్వీ అందాలకు మాత్రం చాలా మంది ఫిదా అయిపోయారు. ఇప్పటికి కూడా జాన్వీ వేసే డ్రెస్ లకు ఆమె పాటించే ఫ్యాషన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా దేవర మూవీలో హీరోయిన్ గా షూటింగ్లో కూడా పాల్గొంది.అంతేకాకుండా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న ఆర్సి 16మూవీలో కూడా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమంలో జాన్వీ కపూర్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక తాజాగా టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం న్యాచురల్ స్టార్ నానితో కూడా జాన్వీ కపూర్ కి హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.అయితే వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న జాన్వీ కపూర్ తాజాగా హాస్పిటల్ పాలైనట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ బయటపెట్టారు. మరి ఇంతకీ జాన్వీ కపూర్ కి ఏమైంది.. ఎందుకు హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. జాన్వీ కపూర్ తిన్న ఆహారం కల్తీ అవ్వడంతో ఫుడ్ పాయిజన్ అయింది.

దీంతో అస్వస్థతో జాన్వీ కపూర్ కి అస్వస్థత ఎక్కువవ్వడంతో వెంటనే బోనీ కపూర్ ముంబైలోని హాస్పిటల్ లో తీసుకువెళ్లి చికిత్స అందించారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ చెప్పారు. అంతేకాకుండా జాన్వీ కపూర్ ని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు కావచ్చు అని కూడా చెప్పారు.ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో మా హీరోయిన్ కి ఏమైంది.. ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి అంటూ చాలామంది ఆమె అభిమానులు ఆ దేవుడిని వేడుకుంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hospital devara janhvi-kapoor boney-kapoor

Related Articles