DEVARA: దేవర కోసం జాన్వీ మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..ఎంతంటే..?

సాధార‌ణంగా హీరోల రెమ్యున‌రేష‌న్ తో పోల్చుకుంటే  హీరోయిన్లు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ అందుకుంటారు. చాలా మంది హీరోయిన్లు ప‌ది ల‌క్ష‌ల నుండి రెండు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతోన్న అలనాటి అందాల తార శ్రీదేవి బిడ్డ కండ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంద‌ట‌.


Published Sep 07, 2024 09:31:38 AM
postImages/2024-09-07//1725719462_Untitleddesign9.jpg

సాధార‌ణంగా హీరోల రెమ్యున‌రేష‌న్ తో పోల్చుకుంటే  హీరోయిన్లు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ అందుకుంటారు. చాలా మంది హీరోయిన్లు ప‌ది ల‌క్ష‌ల నుండి రెండు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతోన్న అలనాటి అందాల తార శ్రీదేవి బిడ్డ కండ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంద‌ట‌. ప్ర‌స్తుతం శ్రీదేవి పెద్ద‌కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతోన్న దేవ‌ర సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు, పాట‌లు విడుద‌ల‌వ‌గా మిలియ‌న్స్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయి.

ఇక పోస్ట‌ర్ల‌లో, పాట‌ల్లో జాన్వీ అందానికి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టికే దేవ‌ర సినిమా విడుద‌ల అవ్వ‌క‌ముందే జాన్వీ చేతికి మ‌రో రెండు సినిమాలు వ‌చ్చాయి. అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ రేంజ్ లోనే టాలీవుడ్ లోనూ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంద‌ట‌. నిజానికి టాలీవుడ్ లో కోట్లు అందుకుంటున్న హీరోయిన్ లు అతికొద్ది మంది మాత్ర‌మే ఉన్నారు. సీనియ‌ర్ హీరోయిన్లు న‌య‌న‌తార‌, త్రిష మాత్రం మూడు నుండి నాలుగు కోట్లు పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే జాన్వీ కూడా వాళ్ల రేంజ్ లోనే అందుకోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఈ ముద్దుగుమ్మ దేవ‌ర సినిమాకే ఏకంగా రూ. 3.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోద‌ట‌. అంతే కాకుండా బ్యూటీ చేయ‌బోయే మ‌రో రెండు సినిమాల‌కు రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింద‌ట‌. ఇక ఒక‌ప్పుడు శ్రీదేవి కూడా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో అంద‌రి కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుని రికార్డులు బ‌ద్దలు కొట్టింది. ఇప్పుడు జాన్వీ త‌ల్లికి త‌గ్గ త‌న‌య అనిపించుకోవ‌డంతో శ్రీదేవి అభిమానులు సంబుర‌ప‌డుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : devara

Related Articles