ఈ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందంచబోతుంది. ఫేమ్ గేమ్ సీరిస్ లో చిన్న నెగిటివ్ షేడ్ లో మాధురీ దీక్షిత్ అదరగొట్టేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ తార మాధురీ దీక్షిత్ రీసెంట్ గా ఓ వెబ్ సీరిస్ లో సీరియల్ కిల్లర్ గా నటించనుంది. బ్యూటీ తో పాటు భయంకరమైన కిల్లర్ బ్రెయిన్ కూడాఈ వెబ్ సీరిస్ లో చూపించ బోతుంది మాధురీ దీక్షిత్.. ఈ వెబ్ సిరీస్ పేరు మిస్టర్ దేశ్ పాండే. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందంచబోతుంది. ఫేమ్ గేమ్ సీరిస్ లో చిన్న నెగిటివ్ షేడ్ లో మాధురీ దీక్షిత్ అదరగొట్టేసింది.
ఇక కథలోకి వస్తే ...ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులో మరో సీరియల్ కిల్లర్ సహకారం తీసుకుంటారు. ఓ ఫ్రెంచ్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఒకట్రెండు నెలల్లో మేకింగ్ మొదలవుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనం వెలువడింది. ఇందులో మాధురీ దీక్షిత్ సీరియల్ కిల్లర్ రోల్ లో ఎలా నటిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
మాధురి ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ నటిస్తున్న భూల్ భులాయియా-3లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి మాధురీ ని ఫుల్ లెవెల్ నెగిటివ్ రోల్ లో కనిపించనుంది.