Manorathangal: 8 మంది హీరోలు , 8 మంది డైరక్టర్లు కలిసి తీసిన వెబ్ సీరిస్ !

MT వాసుదేవన్ నాయర్ పుట్టినరోజు సందర్భంగా 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో మలయాళ ఇండస్ట్రీలోని అత్యుత్తమ టెక్నీషియన్లంతా కలిసి నిర్మించిన 'మనోరథంగల్' ట్రైలర్‌ను విడుదల చేశారు. అసలు వినడానికే చాలా క్యూరియస్ గా ఉంది. అలాంటి వెబ్ సీరిస్ రిలీజ్ అయితే చూడాలి.


Published Jul 16, 2024 11:37:41 AM
postImages/2024-07-16/1721147840_manorathangal1607241.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : MT వాసుదేవన్ నాయర్ పుట్టినరోజు సందర్భంగా 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో మలయాళ ఇండస్ట్రీలోని అత్యుత్తమ టెక్నీషియన్లంతా కలిసి నిర్మించిన 'మనోరథంగల్' ట్రైలర్‌ను విడుదల చేశారు. అసలు వినడానికే చాలా క్యూరియస్ గా ఉంది. అలాంటి వెబ్ సీరిస్ రిలీజ్ అయితే చూడాలి.


ఓటీటీలోకి త్వరలోనే ఓ క్రేజీ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. ఎనిమిది మంది లెజెండరీ నటులు ఈ సీరీస్ లో కలిసి నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో జీ5లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. మలయాళ నటుల్లో టాప్ స్టార్స్ అంతా ఈ సీరిస్ లో ఉన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ పేరు 'మనోరథంగల్'. తొమ్మిది కథలకు ఎనిమిది మంది టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. 


ఇక  స్టార్స్ అంటారా ..మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు. వచ్చే నెల 15 వతారీఖున రిలీజ్ అవుతుంది. టాప్ స్టార్స్ అంతా కలిసి నటించిన సీరిస్ కావడంతో ఈ సీరిస్ పై చాలా ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.


MT వాసుదేవన్ నాయర్‌కు 90వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ జీ5 సంస్థ రిలీజ్‌ చేసింది.  'మనోరథంగల్' కోసం మాలీవుడ్ టాలెంట్ అంతా ఒకే చోటుకి చేరింది. దాదాపు అన్ని బాషల్లోను రిలీజ్ చేస్తున్నారు. ఇది మలయాళం ఇండస్ట్రీని మరో మెట్టు పైకి తీసుకొని వెళ్తుంది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries kerala-heroine-

Related Articles