MP Vadiraju: సింఘ్వీ తెలంగాణకు ఏరోజు సానుకూలంగా స్పందించలే

తెలంగాణ విషయంలో అభిషేక్ సింఘ్వీ ఏరోజు సానుకూలంగా స్పందించలేదన్నారు.


Published Aug 15, 2024 08:19:07 PM
postImages/2024-08-15/1723733347_vadiraju.PNG

న్యూస్ లైన్ డెస్క్: కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వీహెచ్ సహా బీసీ, ఎస్సీ, మైనార్టీలు కనిపించలేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వద్దరాజు మాట్లాడుతూ తెలంగాణ విషయంలో అభిషేక్ సింఘ్వీ ఏరోజు సానుకూలంగా స్పందించలేదన్నారు.

కాంగ్రెస్‌లో అర్హులు ఎంతో మంది ఉన్నా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఐదు బీసీ సామాజిక వర్గాలు, ముస్లింలకు మంత్రి పదవులు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులు లేనట్లు రాజస్థాన్ వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారని వదిరాజు పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress cm-revanth-reddy loksabha

Related Articles