Mythri Movie: వరద బాధితులకు మైత్రి మూవీ మేకర్స్ విరాళం

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  వరద బాధితులకు ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించింంది.


Published Sep 06, 2024 11:49:07 AM
postImages/2024-09-06/1725603547_makers.PNG

న్యూస్ లైన్ సినిమా: భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, వరద బాధితులకు ఆదుకునేందుకు సినీ పరిశ్రమ నుంచి భారీ ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  వరద బాధితులకు ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించింంది. రెండు తెలుగు రాష్టాలకు 50 లక్షలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు విరాళాన్ని అందించారు. 

ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయన్ని తెలియజేశారు. గడచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ఆ తర్వాత వచ్చిన వరదల కారణంగా ప్రాణ, జీవనోపాధి ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆపద సమయంలో చేపట్టిన సహాయక చర్యలలో సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు (ఒక్కొక్కటి 25 లక్షలు). ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని, బాధిత ప్రజలు తమ జీవితాల్లో సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ పోస్టులో పేర్కొంది. 

newsline-whatsapp-channel
Tags : telangana andhrapradesh tollywood movie-news floods-in-telangana

Related Articles