Nagarjuna:తోసేసిన అభిమానిని కలిసిన నాగార్జున..గ్రేట్ అంటూ ప్రశంసలు.!

అక్కినేని నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో. ఇప్పటికీ 6 పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ యంగ్ హీరోలా కనిపిస్తూ ఉంటారు. అలాంటి నాగార్జున తన కొడుకులు నాగచైతన్య అఖిల్ కంటే ఎక్కువగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. నాగార్జునకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనను ఒక్కసారి కలిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని ఆలోచన చేస్తూ ఉంటారు.


Published Jun 26, 2024 09:05:04 PM
postImages/2024-06-26/1719416104_nag.jpg

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో. ఇప్పటికీ 6 పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ యంగ్ హీరోలా కనిపిస్తూ ఉంటారు. అలాంటి నాగార్జున తన కొడుకులు నాగచైతన్య అఖిల్ కంటే ఎక్కువగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. నాగార్జునకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనను ఒక్కసారి కలిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని ఆలోచన చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఒక అభిమాని నాగార్జునను కలవడానికి ప్రయత్నిస్తే తన పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ వారు తోసేశారు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో  నాగార్జునపై విపరీతంగా నేటిజన్లు విరుచుకుపడ్డారు.  ఈ విషయాన్ని గమనించిన నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తికి స్వారీ చెప్పాడు. అంతేకాకుండా  ఆ వ్యక్తిని ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమాని తనని కలవడానికి స్పీడుగా దగ్గరికి వచ్చాడు. వెంటనే స్పందించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని తోసేశారు.

దీంతో ఆ వ్యక్తి కింద పడబోతుంటే మిగతావారు పట్టుకున్నారు. దీనిపై విపరీతంగా బాధపడిన నాగార్జున అభిమానికి స్వారీ చెప్పడమే కాకుండా తనను కలిసే అవకాశం కూడా ఇచ్చారు. ఆ వ్యక్తితో ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జున మనస్సు గొప్పది, సెక్యూరిటీ చేసిన తప్పుకు ఆయన స్వారీ చెప్పడమే కాకుండా స్వయంగా అభిమానిని కలవడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు. నాగార్జున ప్రస్తుతం కుబేర చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna abimani meet kubhera

Related Articles