Sri Reddy: శ్రీరెడ్డి సూసై** చేసుకుంటుందట.. కారణం వారేనా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఒకప్పుడు సంచలనం సృష్టించినటువంటి యూట్యూబర్ శ్రీరెడ్డి.  ఆమెకు ఎవరు వ్యతిరేకం అనిపిస్తే వారిని పట్టుకుని తిడుతూ గెలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని పవన్ 


Published Jul 31, 2024 06:41:02 AM
postImages/2024-07-31/1722412687_sri.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఒకప్పుడు సంచలనం సృష్టించినటువంటి యూట్యూబర్ శ్రీరెడ్డి.  ఆమెకు ఎవరు వ్యతిరేకం అనిపిస్తే వారిని పట్టుకుని తిడుతూ గెలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్,చిరంజీవి వంటి వారిని ఎప్పటికప్పుడు ఏకిపారేస్తుంది. అలా శ్రీ రెడ్డి  ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మొదటిసారిగా ఫైట్ చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది.  సినీ ఇండస్ట్రీ వారిని, రాజకీయ నాయకులను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వచ్చే శ్రీ రెడ్డి ప్రస్తుతం ఆ*హ*త్య చేసుకుంటానని అంటుంది. దీనికి కారణం టీడీపీ నాయకులు అని అంటుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 ఎన్నికలకు ముందు శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా సపోర్ట్ చేసింది. కానీ ఆమె సపోర్టు కే ఫలితం  రాలేదు. జగన్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు. దీంతో శ్రీ రెడ్డి మళ్ళీ జగన్ పై కూడా విమర్శలు చేస్తూ వచ్చింది. ఓడిపోయినా కానీ కార్యకర్తలను పట్టించుకోవాలని జగన్ కు వార్నింగ్ లు ఇచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిడిపిని విపరీతంగా తిట్టిపోసిన శ్రీ రెడ్డిని ఇప్పుడు టిడిపి వారు దారుణంగా టార్గెట్ చేశారు.

ఆమెను ఎక్కడపడితే అక్కడ నిందిస్తున్నారు. కేసులు కూడా పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే తరుణంలో వైసిపి వాళ్లు కూడా శ్రీ రెడ్డిని పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీరెడ్డి మన పార్టీ కార్యకర్త అని ఏనాడు కూడా గుర్తించింది లేదు. శ్రీ రెడ్డి తనకు తానే వైసీపీ అని చెప్పుకుంటూ టిడిపి పై విమర్శలు చేసింది. ప్రస్తుతం వైసీపీ ఓడిపోయి టిడిపి అధికారంలోకి వచ్చింది కాబట్టి శ్రీ రెడ్డికి చాలా ఒత్తిడి పెరిగిపోతుందట. దీంతో వైసిపి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 తన మనస్థిక స్థితి రోజుకు దిగజారి పోతోందని,మెంటల్ ట్రామాలోకి వెళ్తున్నానని,నార్మల్ అవుతానో లేదో తెలియదని, ఆ భద్రకాళి తల్లే నన్ను కాపాడాలని పోస్ట్ పెట్టింది. అంతేకాదు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయని చెప్పుకొచ్చింది. టిడిపి మీడియా వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నానని అన్నది. శ్రీ రెడ్డి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi tdp newslinetelugu pawan-kalyan mega-family ycp jagan sri-reddy

Related Articles