TDP: అన్నా క్యాంటిన్ లేనిదే తిండి లేదన్న వ్యక్తి అసలు బాగోతం ఇదా..!

కరోనా సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు. అన్నా క్యాంటిన్లు లేకపోతే.. తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితికి దిగజారిపోయామని ఆయన అన్నాడు.


Published Aug 17, 2024 03:00:59 AM
postImages/2024-08-17/1723881561_tdp.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా అన్న క్యాంటిన్లను మూసేశారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటిన్లను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా రూ.15 చెల్లిస్తే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కొనుగోలు చేయొచ్చు. గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. అయితే, ఈ  క్యాంటిన్ ప్రారంభోత్సవంలో చంద్రబాబుతో మాట్లాడిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

కరోనా సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు. అన్నా క్యాంటిన్లు లేకపోతే.. తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితికి దిగజారిపోయామని ఆయన అన్నాడు. ఇది చూసినవారంతా నిజంగా నిజమేమో అనుకునే విధంగా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఇది చూసినవారంతా.. అయ్యో పాపం అనుకున్నారు. అయితే అసలు కథ వేరే ఉందని మరికొందరు ఆ వ్యక్తిని తెగ ట్రోల్ చేస్తున్నారు. 

ఇదంతా టీడీపీ ఆడిన డ్రామా అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆ వ్యక్తి బిర్యానీలు తింటున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అన్నా క్యాంటిన్ లేకపోతే తినడానికి తిండి కూడా లేని స్థితి వచ్చిందని చెప్పిన ఆ వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ రాము అనుచరుడని అంటున్నారు. పబ్లిసిటీ కోసమే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఎన్ని చేసినా చివరికి అతని అసలు బాగోతం బయటపడిందని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news andhrapradesh tdp news-line newslinetelugu appolitics telanganam ap

Related Articles