High Court: రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌కి బుధవారం కోర్టు నోటీసులు జారీ చేసింది.


Published Aug 21, 2024 09:23:10 AM
postImages/2024-08-21/1724250023_highcourt.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌కి బుధవారం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా వైరా సభలో రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.

మే 17న మొదటిసారిగా విచారణకు రాగా.. మేజిస్ట్రేట్ మే 22కి వాయిదా వేశారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ వాయిదా ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకటేశ్వర్లు తెలంగాణ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ఈ ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు మేజిస్ట్రేట్ మళ్లీ పిటిషన్‌పై విచారణ జరిపి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy telanganahighcourt

Related Articles