జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక వల్ల రాశుల వారిపై ప్రభావం పడి వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సెప్టెంబర్ 29న ఏర్పడే శుక్లపక్ష దశమినాడు చంద్రుడు కర్కాటక రాశిలోకి రావడం వల్ల అమృత
న్యూస్ లైన్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక వల్ల రాశుల వారిపై ప్రభావం పడి వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సెప్టెంబర్ 29న ఏర్పడే శుక్లపక్ష దశమినాడు చంద్రుడు కర్కాటక రాశిలోకి రావడం వల్ల అమృత సిద్ధ యోగం ఏర్పడుతోంది దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి ఘడియలు ప్రారంభమవుతాయట. ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం..
కుంభరాశి:
అమృత సిద్ధియోగం వల్ల కుంభ రాశిలోని జాతకులకు అన్ని శుభాలే కలుగుతాయి. వీరి వల్ల సంతోషం పెరగడమే కాకుండా ఇష్టమైన వాళ్ళతో మంచి టైం గడుపుతారని అంటున్నారు. మరియు ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి అన్ని అనుకూలంగా కలిసి వస్తాయని ఇప్పటినుంచి శుభ ఘడియలు ఉంటాయని తెలియజేస్తున్నారు.
వృషభ రాశి:
ఈ రాశి వల్ల అమృత సిద్ధియోగం ఏర్పడి మంచి ఫలితాలు ఉంటాయట. ఎట్టి సమయంలో అయినా ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొని ముందుకు వెళ్తారట. ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కర్కాటక రాశి:
ఈ రెండు యోగాలు కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. గతంలో వీరికి వచ్చినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం.
ధనస్సు రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎలాంటి పనులు చేసిన అన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరంగా బలపడతారు. కుటుంబ సభ్యుల సపోర్టు లభించి ఆనందంగా జీవిస్తారు.