Rajinikanth: తిరుపతి లడ్డూ వివాదంపై ..నో కామెంట్ అంటున్న రజినీ కాంత్!

రిపోర్టర్ క్వశ్చన్ చేయగా సారీ నో కామెంట్స్‌ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  


Published Sep 28, 2024 08:20:00 PM
postImages/2024-09-28/1727535071_rajinikanth.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తిరుమల లడ్డూ పై ఏదో రచ్చ జరుగుతూనే ఉంది. తెలుగు, తమిళం అన్ని ఇండస్ట్రీ పెద్దలు తమ వాయిస్ వినిపిస్తున్నారు.ఇదే విషయంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను అడిగితే, సమాధానం చెప్పడానికి ఆయన ఆసక్తి చూపలేదు. రజనీ తన తాజా చిత్రం వేట్టయాన్‌ ప్రమోషన్స్‌లో రజినీ హాజరయ్యారు తిరుమల లడ్డూ వ్యవహారం పై రిపోర్టర్ క్వశ్చన్ చేయగా సారీ నో కామెంట్స్‌ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  


రజనీకాంత్‌ హీరోగా నటించి వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల సత్యం సుందరం ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొన్న తమిళ నటుడు కార్తీ 'ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు.. సున్నితమైన అంశం' అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. రజినీ రియాక్ట్ కాకపోవడం ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. పొలిటికల్ ఇష్యూస్ వస్తాయని రియాక్ట్ కాలేదా..లేక ఎందుకు పవన్ తో పేచీ అని రియాక్ట్ కాలేదా అనేది ఇప్పుడు పెద్ద డిబెట్ నడుస్తుంది.


ఒక స్థాయిలో ఉన్నపుడు ఏ మాట్లాడితే ఏం గొడవొస్తుందో సైలెంట్ గా ఉండడం మంచిది అని  అనుకోవడం లో తప్పులేదని కూడా అంటున్నారు ఓ వర్గం వారు. ఏదో ఒకటి మాట్లాడి అడగాలి కదా...ప్రతి హిందువుకు వాయిస్ రైజ్ చేసే హక్కు ఉందని మరికొందరు వాదించుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : rajinikanth newslinetelugu comments tirumala-laddu

Related Articles