దక్షిణ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.
న్యూస్ లైన్ డెస్క్: దక్షిణ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. అక్కడి స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజధాని లిమా నుంచి 40 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. అయితే సమాచారం అందిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ఘటనాస్థలా నికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. పర్వత రోడ్లు, వేగంగా వెళ్లడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ సంకేతాలు లేకపోవడం వంటి కారణాల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా గుర్తించారు. కాగా, పెరూలో తరచూగా రోడ్డు ప్రమాదాలు జరుగు తుంటాయి. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో ఆ దేశంలో మొత్తం 3,100 మంది ప్రాణాలు కోల్పోయారు.