Accident: నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 40 మంది భారతీయులు

వీరిలో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు. 


Published Aug 23, 2024 01:01:42 PM
postImages/2024-08-23/1724398302_Nepalbusaccident.jpg

న్యూస్ లైన్ డెస్క్: నేపాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ టూరిస్టులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఫోఖారా నుంచి కాఠ్మాండూకి వెళుతున్న బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. బస్సులో 40 మంది భారతీయ ప్రయాణికులున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. బస్సు నంబరు UP FT 7623గా గుర్తించారు. 

వీరిలో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక భారత అధికారులకు ఆదేశాలిచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam national crime nepal nepalaccident indian-tourists-in-nepal

Related Articles