ఆగస్టు 3న రాత్రి అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి బయలుదేరనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం సీఎం అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన అమెరికాలో వారం రోజుల పాటు బస చేయనున్నారు. ఆగస్టు 3న రాత్రి అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి బయలుదేరనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో రేవంత్రెడ్డి పర్యటించనున్నారు.
అక్కడ పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అన్ని సమావేశాలు పూర్తయిన తరువాత.. ఆగస్టు 11న అమెరికా నుంచి రేవంత్రెడ్డి తిరిగి రానున్నారు.