Congress: కాంగ్రెస్ ఎన్నారై కార్యకర్తల ఆర్తనాదాలు

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై కార్యకర్తలు ఆర్తనాదాలు పడుతున్నారు.


Published Aug 06, 2024 05:52:57 PM
postImages/2024-08-06/1722946977_reamerica.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై కార్యకర్తలు ఆర్తనాదాలు పడుతున్నారు. “మమ్మల్ని కలవనీయరా.. మాకు అవకాశమివ్వరా” అంటూ అమెరికాలోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారైల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. రేవంత్ చుట్టూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎన్నారైలు చేరి కాంగ్రెస్ ఎన్నారైలను పక్కకు తోసేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తెలంగాణ సీఎం వచ్చినప్పుడు మమ్మల్ని కలవనియ్యకపోతే మా సమస్యలు ఎలా చెప్పుకోవాలి, మాకు సంబంధించిన అంశాల గురించి ఎలా చర్చించాలని బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీరే పక్కన ఉంటే మా వాళ్ళు ఎలా కలుస్తారు.. బాబు, జగన్ వచ్చినప్పుడు మేము అలానే వెంటపడ్డామా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో.. ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారని పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే ఆగ్రహంగా అన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ మరక అంటుకున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళ అతిప్రేమ వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి మీద టీడీపీ వాళ్ళు చూపిస్తున్న అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చేలా ఉందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy america

Related Articles