manu bhaker: జస్ట్ మిస్.. పారిస్ ఒలింపిక్స్‌లో చేజారిగిన మెడల్

క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన మను.. ఫైనల్ లో ఆడేందుకు అర్హత సాధించింది. ఇప్పటికే రెండు పతకాలు సాధించింది.  


Published Aug 03, 2024 01:51:18 PM
postImages/2024-08-03/1722673278_manu.jpg

న్యూస్ లైన్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడల్ మిస్ అయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇండియన్ స్టార్ షూటర్ మనుబాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మనుబాకర్ రెండు పథకాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ఆమె రెండు కాంస్య పథకాలను తెచ్చి పెట్టింది. 

క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన మను.. ఫైనల్‌లో ఆడేందుకు అర్హత సాధించింది. ఇప్పటికే రెండు పతకాలు సాధించింది. ఇక ఫైనల్ రౌండ్‌లో తృటిలో పథకాన్ని మిస్ చేసుకున్నప్పటికీ.. మను చేసిన ప్రయత్నానికి ఆమె అభిమానులతో పాటు భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu manubhaker olympics

Related Articles