Deepthi jeevanji: పారాలింపిక్స్ పతక విజేత దీప్తి ఘన స్వాగతం

పారిస్ పారాలింపిక్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించి తొలి తెలుగు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజికి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది.


Published Sep 06, 2024 08:11:49 AM
postImages/2024-09-06/1725590509_para.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: పారిస్ పారాలింపిక్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించి తొలి తెలుగు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజికి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. కాసేపట్లో దీప్తి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకోనున్నారు. 

పారాలింపిక్స్‌లో కాంస్యం ప‌త‌కంతో మెరిసిన‌ రన్నర్ దీప్తికి స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. పారిస్‌లో భార‌తావ‌ని గ‌ర్వ‌ప‌డేలా చేసిన దీప్తి జీవాంజి స్వ‌రాష్ట్రమైన తెలంగాణలో అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఘన స్వాగతం పలికారు. సొంత‌గ‌డ్డ‌పై అపూర్వ స్వాగ‌తానికి ఫిదా అయిన రన్నర్ దీప్తి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. 

newsline-whatsapp-channel
Tags : telangana congress-government paris2024 olympic2024-

Related Articles