Para Olympics: కాంస్యం సాధించిన దీప్తికి కేటీఆర్ అభినందనలు

తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు


Published Sep 04, 2024 08:24:30 AM
postImages/2024-09-04/1725455331_ktrcong.PNG

న్యూస్ లైన్ డెస్క్: పారిస్ పారాలింపిక్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించి తొలి తెలుగు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అసమాన ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచారని ఆయన తెలిపారు.

ఆడపిల్లలు తమ అసమానమైన శక్తి సామర్థ్యాలతో ఎంతటి ఆనందాన్ని తల్లితండ్రులకు ఇస్తారో ఆడపిల్ల తండ్రిగా తనకు తెలుసు అని అన్నారు. ఎన్ని కష్టాలున్నా సరే, దీప్తి తల్లితండ్రులు మాత్రం తనపై నమ్మకం ఉంచటం గొప్ప విషయం అన్నారు. ఆ తల్లితండ్రుల నమ్మకాన్ని నిలుపుతూ, దీప్తి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవటం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr warangal paris-olympic

Related Articles