Revanth Reddy: ఉద్యోగులా.. బొంగేం కాదు!

ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి నోరు జారారు. అతి చేస్తారు.. బొంగేం కాదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.


Published Jul 23, 2024 08:50:03 PM
postImages/2024-07-24/1721785722_IMG20240724071247640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్సీ: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు. మొన్న నిరుద్యోగులను తలకుమాసినోళ్లన్న ఆయన.. నేడు ఉద్యోగులను మెదడు తక్వ నాయాళ్లంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటి బడ్జెట్‌పై ప్రెస్ మీట్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కుర్చీలు దగ్గరకు వేయాలి దూరం ఎవడేస్తడయా.! మెదడు తక్వ నాయాళ్లు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరో మంత్రి పొన్నం ‘ఇందాక వేసి ఉంచారు, అలాగే వచ్చి కూర్చున్న’ అని  చెప్తుండగా.. ప్రభుత్వ ఉద్యోగులు అతి భక్తి చూపిస్తారని సీఎం వ్యాఖ్యానించారు. ‘అట్లాగే ఉండాలి కదా’ అని పొన్నం రిప్లయ్ ఇచ్చారు. దానికి మరోసారి స్పందిస్తూ.. ‘బొంగేం కాదు’ అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు. సీఎం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు ఉద్యోగులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy newslinetelugu cm-revanth-reddy press-meet latest-news

Related Articles