యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉందంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించగా ఎన్నికల నిర్వహణకే ఢిల్లీ పెద్దల మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా, మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధిష్టానం సిద్ధమవుతుంది. దాంతో సీఎం స్థానంలో ఉండి పార్టీలో తన మాట నెగ్గించుకోలేక పోతున్నానంటూ రేవంత్ వాపోతున్నట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.