Jagan: శిశుపాలుడిలా బాబు పాపాలు పండుతున్నాయి

ఎన్నికల్లో రుణ మాఫీ, మహిళకు నగదు, ఇంటికి ఇంటికి ఉద్యోగం అన్నారు ముందు వాటిని అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.


Published Jul 06, 2024 04:44:13 AM
postImages/2024-07-06//1720258643_ysreddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: టీడీపీ నాయకుల దాడిలో గాయపడి రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని ఏపీ మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.  హాస్పిటల్‌లో 20 ఏళ్ళ పిల్లాడిని నిర్దాక్షణ్యంగా కొట్టారని, వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి ఆసుపత్రి పాలు చేసారని ఆరోపించారు. పులివెందులలో ఇలాంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేదని, ఎన్నికల తర్వాత అంతా కలిసి వుండే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ సంప్రదాయానికి త్రిలోదకాలు పలికి చెడు సంప్రదాయానికి తెరాలేపారని, ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎన్నడూ లేదన్నారు.

టీడీపీ నేతలు భయాందోళన వాతావరణం సృస్టించాలని చూస్తున్నారని, అధికారంలో చేసిన ఈ సంప్రదాయం చంద్రబాబుకు చుట్టుకుంటుందని, ఇప్పటికైనా ఈ సంప్రదాయం ఆపాలని బాబును ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవస్థలు గాడిలో పెడిందని, మోసపురిత వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో రుణ మాఫీ, మహిళకు నగదు, ఇంటికి ఇంటికి ఉద్యోగం అన్నారు ముందు వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయిని అన్నారు. ఇంతవరకు స్కూల్ బాగ్స్ అందించలేదని, అతిసారాతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపాన పోలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

newsline-whatsapp-channel
Tags : chandrababu andhrapradesh jagan hospital

Related Articles