BIRYANI: దసర ఆఫర్ లో బిర్యానీ ..ఎగబడుతున్న జనాలు !


తాడేపల్లిగూడెం, భీమడోలులో అన్‌లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లను ఉన్నాయి. అయితే ఎప్పుడు వ్యాపారంలో ముందుండాలంటే ..జనాలను అట్రాక్ట్ చెయ్యాలి


Published Oct 05, 2024 05:02:00 PM
postImages/2024-10-05/1728128262_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏం బిర్యానీ రా నాయనా ..ఎంత తింటారు బిర్యానీ .. ప్రపంచంలో తిండి బిర్యానీ మాత్రమే అన్నట్లు తింటున్నారు. ఈ మధ్య బిర్యానీ లవర్స్ చాలా ఎక్కువైపోయారు. ఆఫర్లు మాట అందరికి తెలిసిందే కాని హోటల్స్ లో దసరా కు బిర్యానీ ఆఫర్లు వినడం మాత్రం చాలా కొత్త గా ఉంది. అది కూడా జస్ట్ మూడు రూపాయిలకే బిర్యానీ ఇస్తున్నామని ప్రకటించింది ఓ హోటల్.


తాడేపల్లిగూడెం, భీమడోలులో అన్‌లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లను ఉన్నాయి. అయితే ఎప్పుడు వ్యాపారంలో ముందుండాలంటే ..జనాలను అట్రాక్ట్ చెయ్యాలి. వ్యాపారాభివృద్దిలో భాగంగా జంగారెడ్డి గూడెంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది యాజమాన్యం. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భోజన ప్రియులకు కన్నులు చెదిరే బంపర్ ఆఫర్ ప్రకటించారు ఈ సంధర్భంగా  బిర్యానీని జస్ట్ 3 రూపాయిలకే ఆఫర్ చేసింది.


ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని షరతు పెట్టారు. కస్టమర్లు క్యూ లైన్లో వచ్చి రూ.3 చెల్లించి బిర్యానీ ప్యాకెట్ తీసుకువెళ్లారు. మూడు గంటలే ఈ ఆఫర్ ఉండడంతో ...కస్టమర్లు భయంకరంగా తోపులాటలు పెట్టుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కేవలం మూడు గంటలే ఈ బంపర్ ఆఫర్ ఉండటంతో వేల మంది అక్కడికి వచ్చారు. దాదాపు ఈ ఆఫర్ 5వేల మంది వరకు యూజ్ చేసుకున్నట్లు తెలిపారు .
 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh viral-news biryani offers dasara

Related Articles