Karnataka: మద్యం సీసాలు పంపిణీ చేసిన బీజేపీ నేత 

కర్ణాటకలోని  చిక్కబళ్లాపూర్ నుండి కొత్తగా బీజేపీ ఎంపీగా ఎన్నికైన కె. సుధాకర్ తన నియోజకవర్గం ప్రజలకు మద్యం సీసాలు పంపిణీ చేశారు


Published Jul 08, 2024 06:49:24 AM
postImages/2024-07-08/1720436586_karnamp.jfif

న్యూస్ లైన్ డెస్క్: కర్ణాటకలోని  చిక్కబళ్లాపూర్ నుండి కొత్తగా బీజేపీ ఎంపిగా ఎన్నికైన కె. సుధాకర్ తన నియోజకవర్గం ప్రజలకు మద్యం సీసాలు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలో సుధాకర్ 1.5 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. దాంతో ఎన్నికల్లో గెలుపొందినందుకు ఎంపీ సుధాకర్ 15 వేల మంది అంచనాతో ఓ పెద్ద గ్రౌండ్‌లో థాంక్స్ గివింగ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో పార్టీ నిర్వాహకులు బహిరంగంగా మద్యం సేవించి పంపిణీ చేశారని ఆరోపించారు. 4 కంటైనర్లలో బీర్లు, ఓ లారీ నిండా బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఇక బిర్యానీ ప్యాకెట్, మద్యం బాటిళ్లను తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. దాదాపు 60 వేల మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ప్రజలను అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. కాగా, పోలీసుల సమక్షంలో వీరంతా మద్యం సేవించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ చిక్కబళ్లాపూర్ ఎంపీ సుధాకర్ పోలీస్ శాఖకు లేఖ రాసి పార్టీలో మద్యం అందజేస్తామని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఎంపీ అయి ఉండి ప్రజలకు మద్యం సీసాలు ఎలా పంపిణీ చేస్తారని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బీజేపీ పార్టీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana karnataka- bjp

Related Articles