MODI: ప్రధాని మోదీ నివాసంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్.. !

తిలకం పూసి పూలమాల వేశారు. ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దాడారు. ఈ వీడియోను మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.


Published Sep 14, 2024 08:51:00 PM
postImages/2024-09-14/1726327376_PMModi.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో కొత్త పోస్ట్ చేశారు. మన గ్రంధాలలో "గావ్ సర్వసుఖ ప్రద " అని చెప్పబడింది. సో లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధానమంత్రి హౌసింగ్ ఫ్యామిలీ లో కొత్త మెంబర్  వచ్చింది.  ఈగుడ్ న్యూస్ ను మోదీ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో ను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రధాని నివాసంలో లేగ దూడ కు ఆవు జన్మనిచ్చింది. దానిని ప్రధాని చాలా ఆనందంగా స్వాగతించారు. తిలకం పూసి పూలమాల వేశారు. ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దాడారు. ఈ వీడియోను మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.


 లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధానమంత్రి హౌసింగ్ ఫ్యామిలీలో కొత్త సభ్యుడు శుభప్రదమైన రాక జరిగింది. ప్రధాన మంత్రి నివాసంలో ప్రియమైన తల్లి ఆవుకు కొత్త దూడ జన్మించింది. దాని నుదిటిపై కాంతి గుర్తు ఉంది. అందుకే దానికి ‘దీప్జ్యోతి’ అని పేరు పెట్టాను అని మోదీ పేర్కొన్నారు. ఈ పేరును నెటిజన్లు చాలా బాగుంది సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


మకర సంక్రాంతి సందర్భంగా కూడా ప్రధాని మోదీ గోవులకు ఆహారం తినిపిస్తున్న వీడియో విడుదలైంది. ప్రధాని నివాసంలో చాలా ఆవులు ఉన్నాయి. మోదీ తరచుగా వాటితో గడుపుతారు. మోదీకి గోసేవ చాలా ఇష్టమైనది కూడా.  ఇవి సాధారణ ఆవు కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. ప్రధాని మోదీ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంగనూరు జాతికి చెందిన ఆవులు ఉన్నాయి. వాటి ఎత్తు రెండున్నర నుంచి మూడు అడుగులు మాత్రమే. ఆ ఆవు అత్యంత పోషకమైన పాలు ఇస్తుంది. చాలా హెల్దీ తో పాటు ..ఆవును చిన్న ప్లేసుల్లో కూడా చాలా హాయిగా పెరుగుతుంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news narendra-modi cow-pooja

Related Articles