Ap:గ్రామ పంచాయతీలకు హైపర్ ఆది విరాళం..ఎంతంటే.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వరదల వల్ల ప్రజల విపరీతంగా నష్టపోయారు. దీంతో వరదల నుంచి బాధితులను ఆదుకోవడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు,  వ్యాపారస్తులు సహాయ సహకారాలు


Published Sep 21, 2024 10:21:44 PM
postImages/2024-09-21/1726937504_HYPERAADI.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వరదల వల్ల ప్రజల విపరీతంగా నష్టపోయారు. దీంతో వరదల నుంచి బాధితులను ఆదుకోవడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు,  వ్యాపారస్తులు సహాయ సహకారాలు అందించారు. ఇందులో ముఖ్యంగా ప్రభాస్, నాగార్జున మెగా ఫ్యామిలీ ఇలా ఎంతోమంది నటినటుల సహకారం అందించారు.  ఇదే తరుణంలో ఫేమస్ కమెడియన్ హైపర్ ఆది కూడా వరద బాధితులకు అందించినట్టు తెలుస్తోంది.  ఈయన రెండు గ్రామపంచాయతీలకు మూడు లక్షల చొప్పున విరాళాన్ని అందించినట్టు తెలుస్తోంది.

ఈ డబ్బును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందించారట. అయితే హైపర్ ఆది, పవన్ కళ్యాణ్ యొక్క వీరాభిమాని కాబట్టి ఆయన ఆరు కోట్ల  ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం అందించారు. దీంతో హైపర్ ఆది కూడా తన అభిమాన హీరో అందించాడు కాబట్టి తాను కూడా తనకు తోచిన విధంగా వరద బాధితులను ఆదుకోవడానికి గ్రామపంచాయతీలకు విరాళాన్ని అందించాలని తెలియజేశారు.

అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో  హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కోసం ఎంతో ప్రచారం చేసి చివరికి విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్న హైపర్ ఆది సాయం అందించడంతో పవన్ అభిమానులు ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : pawankalyan andhrapradesh newslinetelugu pitapuram hyper-aadi helping-

Related Articles