Accident: ఆర్టీసీ బస్సుబోల్తా

ముందు టైరు పేలటంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు సమాచారం. 


Published Sep 07, 2024 12:15:45 PM
postImages/2024-09-07/1725691545_busaccidents.jpg

న్యూస్ లైన్ డెస్క్: సత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బత్తలపల్లి మండలం గుమ్మలకుంట వద్ద ప్రమాదం జరిగింది. నల్లమాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడినట్లు అధికారులు వెల్లడించారు. ముందు టైరు పేలటంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news andhrapradesh news-line newslinetelugu telanganam

Related Articles